Telugu Gateway
Cinema

‘గీత గోవిందం’ పైరసీ కలకలం

‘గీత గోవిందం’ పైరసీ కలకలం
X

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన సినిమానే ‘గీత గోవిందం’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు..టీజర్లకు యూట్యూబ్ లో విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైన తరుణంలో ‘పైరసీ’ వ్యవహారం పెద్ద కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కొత్త సినిమా ‘అరవింద సమేత రాఘవ’ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీక్ అయి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. గీత గోవిందం సినిమాలోని కొంత భాగాన్ని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు అర్బన్‌ పోలీసులు కొంత మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గీత గోవిందం సినిమాలోని కొంత భాగాన్ని దొంగిలించి సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.

గుంటూరు చుట్టుపక్కల రెండు ప్రైవేట్ కాలేజీల విద్యార్ధులు సినిమాను షేర్‌ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో చిత్ర టెక్నికల్ టీంకు చెందిన వ్యక్తి సినిమాలో కొంత భాగాన్ని ఫోన్‌ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. వారు మరింత మందికి పంపించటంతో ఆ సీన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే వీడియో క్లిప్స్‌ ను సర్క్యూలేట్‌ చేసిన విద్యార్థులతో పాటు లీకేజికి పాల్పడిన అసలు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం.

Next Story
Share it