Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ అప్పీల్

పవన్ కళ్యాణ్ అప్పీల్
X

జనసేన, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో సాగుతున్న విమర్శల జోరుకు అడ్డుకట్ట వేసే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. తాను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లనని..అయితే జగన్మోహన్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు బాధించాయని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ప్రకటన ఉంచారు. వ్యక్తిగత అంశాలను రాజకీయ లబ్ది కోసం అసలు వాడనని పేర్కొన్నారు.

ఏదైనా పార్టీని ప్రజలకు సంబంధించిన విధానాల మీద విభేదిస్తాను తప్ప..వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. ఈ తరుణంలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను, వారి ఇంటి ఆడపడుచులను ఈ వివాదంలో లాగవద్దని మనస్పూర్తిగా అందరిని వేడుకుంటున్నానని అన్నారు.

Next Story
Share it