Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు షాక్..ఇద్దరు మంత్రులు జనసేనలోకి!

చంద్రబాబుకు షాక్..ఇద్దరు మంత్రులు జనసేనలోకి!
X

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కష్టకాలం తప్పదా?. అంటే అవునంటున్నాయి టీడీపీ వర్గాలు. అందుకే ఇప్పటి నుంచే ఎవరి ప్లాన్స్ లో వాళ్ళు ఉన్నారు. గత ఎన్నికల సమయం నాటి పరిస్థితులు ఏ మాత్రం లేకపోవటం, ఏపీలో టీడీపీ రాజకీయంగా ఒంటరి కావటంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీకాదని చాలా మంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ తో కలసి పోటీ చేసినా అది లాభం చేస్తుందా?. నష్టం చేస్తుందా అన్నది ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి తప్ప..ముందు అంచనా వేయటం కష్టం. గత ఎన్నికల్లో టీడీపీకి బిజెపి, జనసేనతో పొత్తులు కలసి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వాదనను టీడీపీ నేతలు అంగీకరించకపోయినా..అది మాత్రం వాస్తవం. అయితే ప్రస్తుతానికి జనసేనలోకి జంప్ అవ్వటానికి ఇద్దరు మంత్రులు మాత్రం ఫిక్స్ అయిపోయారు. వారు తమ సీట్లకు అక్కడ నుంచి హామీ పొందారు కూడా. డిసెంబర్ లేదా జనవరిలోనే ఎన్నికలు ఉండటంతో అదను చూసి జంపింగ్ కు నిర్ణయం తీసుకోనున్నారు.

జంప్ అయ్యే మంత్రులు ఒకరు రాజధాని ప్రాంతానికి చెందిన వారు కాగా..మరొకరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. మంత్రులతోపాటు కొద్ది రోజుల క్రితం వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు కూడా కొంత మంది జనసేనకు టచ్ లో ఉన్నారు. అయితే వీరి విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని...చర్చలు కొనసాగుతున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. మంత్రులు చేరిక మాత్రం పక్కా. ఇక మిగిలింది ముహుర్తం నిర్ణయించటం మాత్రమే.

గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిని కానిచ్చే ప్రశ్నలేదని పదే పదే చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన ముఖ్యంగా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఫోకస్ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నేతల భూకబ్జాలు..అవినీతిని కూడ పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. లోకేష్ శాఖలో జరిగిన విశాఖపట్నంలోని రుషికొండ భూముల స్కామ్ ను కూడా పవన్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it