Telugu Gateway
Andhra Pradesh

టీడీపీకి ఝలక్ ఇవ్వనున్న ఎంపీ....ముగ్గురు ఎమ్మెల్యేలు

టీడీపీకి ఝలక్ ఇవ్వనున్న ఎంపీ....ముగ్గురు ఎమ్మెల్యేలు
X

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఏపీలో అధికార టీడీపీ అధిష్టానానికి కూడా ఝలక్ లు ఇచ్చేందుకు నేతలు రెడీ అవుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ఎంపీ...పలు ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఓ మంత్రితో నెలకొన్న విభేదాల కారణంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ ఒకరు పార్టీ మారి..ఎమ్మెల్యేగా పోటీచేసి...మంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ మంత్రి టీడీపీలో ఉండగా..ఇక్కడ తనకు ఛాన్స్ రాదనేది ఆయన అభిప్రాయంగా ఉంది. ఒకప్పుడు పీఆర్పీలో ఉండి..తర్వాత కాంగ్రెస్ లో చేరి..మళ్ళీ ఇఫ్పుడు టీడీపీలో ఎంపీ అయిన ఆయన భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. వైజాగ్ భూ కుంభకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తులో తన పేరు బహిర్గతం చేస్తే తాను కూడా పార్టీ మారటానికి ఎమ్మెల్యే ఒకరు రెడీ అయిపోయారు. ఆయన వియ్యంకుడు ఎమ్మెల్సీ. దీంతో పాటు రాయలసీమకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉండి...పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఆయన కూడా పార్టీ మారటానికే రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరో ఎమ్మెల్యే కూడా జనసేన వైపు చూస్తున్నారు. కొంత మంది వైసీపీ వైపు, మరికొంత మంది జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నుంచి ఈ తరహా వలసలు అంటే ఎన్నికలకు ముందే టీడీపీపై ప్రతికూల సంకేతాలు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రచారం తెరపైకి తెచ్చి అధిష్టానం దగ్గర పనులు చేయించుకుని బయటపడాలని ప్లాన్ చేస్తున్నారా? లేక నిజంగా పార్టీ మారతారా? అనే అంశం కొద్ది కాలం పోతే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

Next Story
Share it