Telugu Gateway
Telangana

ఎంపీని పది లక్షలు డిమాండ్ చేసిన ఛానల్ సీఈవో!

ఎంపీని పది లక్షలు డిమాండ్ చేసిన ఛానల్ సీఈవో!
X

ఒకరు ఏపీకి చెందిన అధికార పార్టీ ఎంపీ. మరొకరు ఛానల్ సీఈవో. ఎంపీ కార్యక్రమ కవరేజ్ కోసం పది లక్షల రూపాయల డిమాండ్ చేసిన వైనం. ఇది ప్రస్తుతం మీడియా వర్గాలతోపాటు సదరు ఛానల్ లో కలకలం రేపుతున్న వ్యవహారం. సీఈవో డిమాండ్ మేరకు ఆ ఎంపీ పది లక్షల రూపాయలు సమర్పించుకున్నట్లు సమాచారం. సదరు ఎంపీ కూడా మీడియా హైప్ కోరుకునే రకమే. గతంలోనూ సదరు సీఈవోపై ఇలాంటి ఆరోపణలే వచ్చినట్లు సదరు ఛానల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఒక్క ఎంపీ అంశం వెలుగులోకి వచ్చిందని..గత కొంత కాలంగా కొంత మంది రిపోర్టర్ల అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ వసూళ్ళ కోసం తనకిష్టమైన వారినే కీలక స్థానాల్లో ఉంచుతూ...మిగిలిన వారిని పక్కకు నెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఛానల్ సీఈవో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన విషయాలు చాలా వరకూ యాజమాన్యం దృష్టికి పోవటం లేదని సమాచారం.

అయితే కొన్ని చోట్ల యాజమాన్యాలే ఏకంగా ‘ప్యాకేజీలు’ మాట్లాడుకుని కవరేజ్ ఇస్తున్నాయి. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా ఆయా రాజకీయ పార్టీలను మోస్తూ..ప్రభుత్వ కాంట్రాక్ట్ లు దక్కించుకుంటూ కోట్లకు కోట్లు గడిస్తున్నాయి. అందుకే అసలు వార్తలు..స్కామ్ లకు బదులు అంతా ‘భజన’ కార్యక్రమాలే సాగుతున్నాయి ఎక్కువ ఛానల్స్ లో. తాజాగా వెలుగులోకి వచ్చిన ఛానల్ సీఈవో విషయంలో అక్కడి ఉద్యోగులు కూడా రెండుగా చీలిపోయి సామాజిక మాధ్యమాల వేదికగా పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it