Telugu Gateway
Telangana

టీడీపీకి మోత్కుపల్లి..కృష్ణయ్య రాం రాం!

టీడీపీకి మోత్కుపల్లి..కృష్ణయ్య రాం రాం!
X

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్. ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులతోపాటు..ఎమ్మెల్యే కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే పార్టీ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’కు వీరిద్దరూ దూరంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా మోత్కుపల్లి అధికార టీఆర్ఎస్ లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కృష్ణయ్య కొత్తగా తెలంగాణలో ‘బీసీల పార్టీ’తో ముందుకెళ్ళే యోచనలో ఉన్నట్లు ప్రచారం ఉంది.

గత కొంతకాలంగా టిడిపి అదినేత చంద్రబాబు వైఖరిపై మోత్కుపల్లి అసంతృప్తితో ఉన్నారు. టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేయాలని మోత్కుపల్లి ప్రతిపాదించడం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఓ సారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కీలక సమావేశానికి మోత్కుపల్లికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. ఈ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొన్నారు.

Next Story
Share it