Telugu Gateway
Andhra Pradesh

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి
X

లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ రాజధాని అమరావతికి అద్భుతమైన డిజైన్లు అందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి మారనుందని పేర్కొన్నారు. కలెక్టర్ ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. బారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాదించిన టీమ్ తమదేనని ఆయన అన్నారు. ధనిక రాష్ట్రాలు కూడా తాము చేస్తున్న కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఒక స్థాయికి వచ్చామని, దానిని నిలుపుకుంటూ ఇంకా ముందుకు వెళ్లేందుకు అందరం మరింత కష్టపడాలని సీఎం సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ 2029 కంటే ముందే దేశంలో నంబర్‌వన్ రాష్ట్రం అవుతుందని.. తన అదికారుల టీమ్ ను చూశాక ఆ నమ్మకం రెట్టింపయ్యిందని చంద్రబాబు అన్నారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ తమదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో నూతన ఆవిష్కరణలకు కేంద్రం కావాలన్నారు. ఈ దిశగా ఆలోచిస్తే వెంటనే ఏపీ పేరు గుర్తుకువచ్చేలా చేయాలన్నారు. ప్రతి శాఖా వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచించాలని..పంచాయతీరాజ్ శాఖ ఈ విషయంలో ముందుందని అన్నారు.

Next Story
Share it