Telugu Gateway
Andhra Pradesh

ధర్మ పోరాటం....వంచన వ్యతిరేక దీక్ష

ధర్మ పోరాటం....వంచన వ్యతిరేక దీక్ష
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎండవేడిని దాటేస్తున్నాయి. ఓ వైపు అధికార పార్టీ కేంద్రం ఇచ్చిన మాట నిలుపుకోలేదని ‘ధర్మ పోరాటం’ అంటూ తిరుపతిలో బహిరంగ సభ తలపెడితే...ప్రత్యేక హోదాపై నిత్యం మాటలు మారుస్తూ ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘వంచన వ్యతిరేక దీక్ష’కు దిగింది వైసీపీ. విశాఖపట్నంలో వైసీపీ ఈ దీక్షకు పూనుకుంది. అధికార టీడీపీ బహిరంగ సభ ద్వారా మోడీ గత ఎన్నికల ప్రచారం సమయంలో ఏపీకీ ఇఛ్చిన హామీలకు చెందిన వీడియో క్లిప్పులను బహిరంగ సభలో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది.

దీని ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే వైసీపీకి చెందిన సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఉదయమే విశాఖపట్నంలో వంచన వ్యతిరేక దీక్షకు దిగారు. వీరు ప్రధానంగా టీడీపీ, బిజెపి తీరును తప్పుపడుతూ దీక్ష చేస్తున్నారు. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన టీడీపీ, బిజెపిలపై హామీల అమలుకు సంబంధించి సమాన బాధ్యత ఉంటుందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఏపీలో రెండు పార్టీల దీక్షలతో రాజకీయం హాట్ హాట్ గా మారింది.

Next Story
Share it