Telugu Gateway
Andhra Pradesh

ఢిల్లీలో ఏపీ ‘కుంభకోణాల చరిత్ర’ విప్పిన కాంట్రాక్టర్లు!

ఢిల్లీలో ఏపీ ‘కుంభకోణాల చరిత్ర’ విప్పిన కాంట్రాక్టర్లు!
X

ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయల పనులు చేస్తున్న బడా కాంట్రాక్టర్ల ఢిల్లీ పిలుపు వచ్చిందా?. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. కొద్ది రోజుల క్రితమే ఈ వ్యవహారం నడిచింది. ముఖ్యంగా బిజెపి, టీడీపీల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన తర్వాతే ఏపీలో జరిగిన ‘కుంభకోణాల వ్యవహారాల’ గుట్టు రట్టు చేసేందుకు ఢిల్లీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మెగా మెగా, బడా కాంట్రాక్టర్లను ఢిల్లీకి పిలిపించి...కీలక సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏ ప్రాజెక్టులో ఎవరికి ఎంత సమర్పించింది..అందులో జరిగిన కుంభకోణాల సమాచారం మొత్తం పూసగుచ్చినట్లు కొంత మంది కాంట్రాక్టర్లు ఢిల్లీకి నివేదించినట్లు సమాచారం. అంటే ఏ క్షణంలో అయినా రంగంలోకి దిగిందుకు అవసరమైన ‘వివరాలు’ సేకరించి పెట్టుకున్నారన్న మాట. ఎందుకంటే ఏపీలో అత్యధిక కుంభకోణాలు..దోపిడీలు జరిగింది సాగునీటి శాఖలోనే కావటంతో...కీలక కాంట్రాక్టులకు సంబంధించిన డాటా మొత్తం సేకరించి పెట్టుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

పోలవరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరగటంతోపాటు..భూ సేకరణ విషయంలోనూ వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ ఐఏఎస్ నుంచి కూడా ఢిల్లీ పెద్దలు సమగ్ర సమాచారం సేకరించారు. ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉన్నట్లు పైకి కన్పిస్తున్నా..అసలు కథ త్వరలోనే ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు...ఎలా అన్నదే తేలాల్సి ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ వైపు ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కూడా చంద్రబాబు సర్కారు ఏ మాత్రం వెనకంజ వేయటం లేదు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి...తాము దోచుకునే విధంగా పెద్దలు స్కీమ్ లు అమలు చేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఓ వైపు నిప్పు నిప్పు అని చెప్పుకుంటూ...చంద్రబాబు ఇంకా తన ‘స్కీమ్’లు అమలు చేస్తూనే ఉన్నారనే అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it