‘ఎట్టకేలకు’ అసలు రాజధాని పనులకు టెండర్లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏది చేపట్టినా కాస్ట్లీనే. ఒక్క సచివాలయానికే 2176 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు. ఎట్టకేలకు అమరావతిలో అసలు రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. తొలుత సచివాలయ నిర్మాణ పనులకు సీఆర్ డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయాన్ని మొత్తం ఐదు టవర్లు గా అభివృద్ది చేయాలని నిర్ణయించారు.దీనికి 2176 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని లెక్కలేశారు. ఐదు టవర్ల మొత్తం నిర్మిత సామర్ధ్యం 34 లక్షల చదరపు అడుగులు ఉంటుందని తెలిపారు.
లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ సంస్థ గత మూడేళ్లులుగా పలు మార్పులు చేసి సచివాలయ డిజైన్లు తయారు చేసింది. ఈ అంతర్జాతీయ ఎంతో పేరుగాంచిన ఈ సంస్థ చేసిన డిజైన్లకు ఏపీ సీఎం చంద్రబాబు పలు మార్పులు, చేర్పులు సూచించారు. కొత్త సచివాలయంలో ఎవరి బ్లాక్ వారికి ఉండేలా డిజైన్ చేశారు. కార్యదర్శులు, శాఖాధిపతులు కార్యాలయాల కోసం రెండు బ్లాక్ లు నిర్మిస్తున్నారు. సీఎం కార్యాలయాన్ని జీఏడీ టవర్ గా పిలుస్తున్నారు. మే 16లోగా ఆసక్తి ఉన్న సంస్థలు బిడ్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే రోజు సాంకేతిక బిడ్లను పరిశీలిస్తారు.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT