Telugu Gateway
Andhra Pradesh

టీడీపీకి మరో షాక్ !

టీడీపీకి మరో షాక్ !
X

ఎన్నికల సంవత్సరంలో ప్రవేశించిన తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆనం సోదరులు ఇద్దరూ టీడీపీలో చేరినా...పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వీరికి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. చంద్రబాబు తమను దారుణంగా మోసం చేశారని కొద్ది రోజుల క్రితం ఆనం వివేకానందరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

పార్టీ మారి తప్పు చేశామని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో ఏదో సర్దుబాటు జరిగినా..ఇక లాభం లేదనుకుని రామనారాయణరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆనం వివేకానందరెడ్డిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు రామనారాయణరెడ్డి అక్కడ నుంచి ఉద్దేశపూర్వకంగా పక్కకు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it