Telugu Gateway
Telangana

ఎంపీ కవితపై డీఎస్ తనయుడి విమర్శలు

ఎంపీ కవితపై డీఎస్ తనయుడి విమర్శలు
X

నిజామాబాద్ ఎంపీ కవితపై సీనియర్ నేత, ఎంపీ డీ. శ్రీనివాస్ తనయుడు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ ప్రస్తుతం జిజెపిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో ఉన్నందుకు జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించాలని ఆయన తన తండ్రికి సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద కలకలం రేపాయి. ‘నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాపం చంద్రబాబుదే. అయితే దాని విషయంలో ఇప్పుడు నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న కవిత పట్టించుకోవటం లేదు. మీరు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి. కాబట్టి, చొరవ తీసుకుని ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చెయ్యండి.

సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని డీఎస్ కు అరవింద్‌ పేర్కొన్నారు. ‘చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించకుండా కవిత అడ్డుకుంటున్నారు. రైతులు చెరుకు పంటకు దూరంగా ఉంటున్నారని.. ఉద్యోగాల విషయంలో యువత ఆసక్తి చూపటం లేదని ఆమె ఏవో సాకులు చెబుతున్నారు. పసుపు బోర్డు విషయంలో అయితే ముందడుగే వేయలేదు. చిన్న చిన్న హామీలు ఇవ్వటం కాదు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మీ నుంచి పెద్దవే ఆశిస్తుంటారు. ముందు పెద్ద సమస్యలపై దృష్టిసారిస్తే మంచిది’ అని పేర్కొన్నారు.

Next Story
Share it