కెసీఆర్ పై సీబీఐ..ఈడీలకు ఫిర్యాదు
BY Telugu Gateway17 March 2018 3:34 AM GMT

X
Telugu Gateway17 March 2018 3:34 AM GMT
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడు పెంచారు. తెలంగాణ సీఎం కెసీఆర్ లక్ష్యంగా ఆయన ఢిల్లీలో అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సీఎం కెసీఆర్ పాల్పడిన అవినీతికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని..ఈ వివరాలను త్వరలోనే సీబీఐ, ఈడీ డైరక్టర్ లకు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో 1.40 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కేవలం నాలుగే కంపెనీలకు అప్పగించారని..దీని వెనక పెద్ద కుంభకోణం ఉందన్నారు. ఈ కంపెనీల నుంచి కెసీఆర్ భారీ ఎత్తున కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ముగియగానే తాను ఇదే పనిలో ఉంటానని తెలిపారు.
Next Story