Telugu Gateway
Telangana

కెసీఆర్ ‘ఢిల్లీ’ ప్లాన్స్ లో కదలిక

కెసీఆర్ ‘ఢిల్లీ’ ప్లాన్స్ లో కదలిక
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఢిల్లీ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి వ్యక్తం చేసిన కెసీఆర్ ఇప్పుడు అందుకు అవసరమైన ‘క్షేత్రస్థాయి’ పరిస్థితి రెడీ చేసుకునేందుకు సంసిద్ధులు అయ్యారు. అందులో భాగంగా దేశంలో వివిధ రంగాల ప్రముఖులతో భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదట విడత రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు వుంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

కేంద్రంలో కీలక పదవుల్లో పనిచేసిన అధికారులు, సైనిక రంగంలో పనిచేసిన వారితో సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఈ భేటీలు కేవలం హైదరాబాద్‌కు పరిమితం కాకుండా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగుళూరులలో నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. మరోవైపు జాతీయస్థాయిలో వివిధ పార్టీలకు చెందిన నాయకుల నుంచి కేసీఆర్‌కు ఫోన్లు వస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it