Telugu Gateway
Top Stories

పేలిన ఇండిగో విమాన టైరు..తప్పిన పెను ప్రమాదం

పేలిన ఇండిగో విమాన టైరు..తప్పిన పెను ప్రమాదం
X

ఇండిగో విమానాలు అంటే ఈ మధ్య అందరూ భయపడాల్సిన పరిస్థితి. ఈ ఎయిర్ లైన్స్ కు చెందిన ఇంజన్లలో సమస్యలు తలెత్తటంతో డీజీసీఏ పలు విమానాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇండిగో ఇంజన్లపై ఆందోళన నెలకొన్న తరుణంలో ఓ విమానం టైరు ల్యాండింగ్ సమయంలో పేలిపోయింది. అంతే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అయినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఇండిగో విమానం బుధవారం తిరుపతి నుంచి రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది... ఇంతలో ఒక్కసారిగా టైర్‌ పేలిపోయింది.

మంటలు వ్యాపించాయి.. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే రోజాతోపాటు 70 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం సమయంలో విమానాన్ని సుమారు గంటపాటు రన్‌వేపైనే ఉంచారు. గేట్లు కూడా తెరవలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ప్రమాదం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొన్ని గంటల పాటు ఇబ్బంది తలెత్తింది.

Next Story
Share it