Telugu Gateway
Andhra Pradesh

మంత్రి పదవులకు అశోక్, సుజనా గుడ్ బై

మంత్రి పదవులకు అశోక్, సుజనా గుడ్ బై
X

తెలుగుదేశం తరపున కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహిస్తున్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి గురువారం నాడు తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని బుధవారం నాడే చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుని..ఆ సమాచారాన్ని మంత్రులకు చేరవేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా గురువారం సాయంత్రం వీరిద్దరూ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయి..రాజీనామా లేఖలు అందజేశారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో మోదీ చర్చించారు. తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సమయంలో మోదీని కలుసుకున్న టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగుతున్నట్లు రాజీనామా లేఖలను ప్రధానికి సమర్పించారు.

తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం ప్రకారమే తాము రాజీనామాలు చేశామన్నారు. ఇప్పుడు తాము మరింత స్వేచ్చ పొందుతామని..రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని సుజనా చౌదరి తెలిపారు. విభజన చట్టంలో ఉన్న అంశాలు అన్నీ కేంద్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ తమ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారని..అయితే ఈ చర్చల సారాంశం తమకు తెలియదని వెల్లడించారు.

Next Story
Share it