Telugu Gateway
Telangana

తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్ కె జోషీ

తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్ కె జోషీ
X

తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో జోషి నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ బుధవారం నాడే పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఆయనకు మూడు నెలలు పొడిగింపు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.

సర్కారుకు కూడా ఆసక్తిలేకనే ఈ అంశంపై దృష్టి పెట్టలేదని..కావాలని పట్టుపడితే కేంద్రం అనుమతి ఇఛ్చేది అధికార వర్గాలు అంటున్నాయి. ఎస్పీ సింగ్ ను కూడా నిరాశపర్చినట్లు ఉండకూడదనే ఉద్దేశంతో మూడు నెలల పొడిగింపునకు లేఖ రాసి వదిలేశారు. కేంద్రం నో చెప్పటంతో..కొత్త సీఎస్ గా ఎస్ కె జోషిని నియమించారు. ఎస్ కె జోషికి సౌమ్యుడిగా పేరుంది.

Next Story
Share it