బిజెపిని ఏమీ అనొద్దు
గుజరాత్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఏపీ బిజెఫి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అవినీతి చేస్తున్నారో..ఎవరు అవినీతిరహిత పాలన అందిస్తున్నారో అందరూ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పరిపాలన వదిలేసి ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు అని టీడీపీ పేరు పెట్టకుండానే వీర్రాజు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తాము సీట్లు అడిగి తీసుకునే పరిస్థితిలో ఉండమని...డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉంటామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ వెంటనే స్పందించారు. సోము వీర్రాజు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారని..ఆయనపై చంద్రబాబు పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
కానీ సీన్ కట్ చేస్తే బిజెపిపై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు మీడియాకు లీకులు అందాయి. పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేయడాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT