టీడీపీకి మరో షాక్
ఏపీలో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికార టీడీపీకి..తెలంగాణలో మాత్రం షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు తమ దారి తాము చూసుకోగా...ఇప్పుడు మరో కీలక నేత అదే బాటలో పయనించారు. మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కూడా టీడీపీని వదిలిపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన కుమారుడు సందీప్రెడ్డితో కలిసి ఆమె అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిరువురు మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును కలిశారు. టీఆర్ఎస్లో చేరాలని వీరిని సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ఉమా మాధవరెడ్డి, సందీప్రెడ్డి పార్టీ మారనున్నారని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని గతంలో ప్రచారం జరిగింది. అయితే సీటుకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరలేదని, టీఆర్ఎస్లోకి రమ్మని ఆహ్వానిస్తే ఆలోచిస్తానని ఆమె అప్పుడు చెప్పారు. ఏ పార్టీలో చేరినా, తన కుమారుడి వెంట ఉంటానని ఉమా మాధవరెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆమె వ్యాఖ్యానించారు.