Telugu Gateway
Telangana

సిలికాన్ వ్యాలీతో హైద‌రాబాద్ లింక్ కు ఇది నాంది

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ...అమెరికా ప్రెసిడెంట్ త‌న‌య ఇవాంకా ట్రంప్ లు హైద‌రాబాద్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. జీఈశ్రీ‌స్ స‌మావేశంలో ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ కీల‌కోప‌న్యాసం చేశారు. ఈ సదస్సు సిలికాన్‌ వ్యాలీతో హైదరాబాద్‌ను కలపడానికి దోహదం చేస్తుంద‌న్నారు. అదే స‌మ‌యంలో భారత్‌ అమెరికా బంధాన్ని మ‌రింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. మహిళలే ఫ‌స్ట్ అన్న సదస్సు థీమ్‌ వినూత్నమైందన్నారు. అమెరికాతో కలిసి సదస్సును దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించడం సంతోషకరమన్నారు. భారత పురాణాల ప్రకారం మహిళ ఒక శక్తి.. మహిళలు మనకు స్ఫూర్తి ఇస్తున్నారని కొనియాడారు. మోడీ త‌న ప్ర‌సంగంలో సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, సానియా మీర్జాల పేర్ల‌ను ప్ర‌స్తావించారు. వీరంద‌రికీ హైదరాబాద్‌ పుట్టిల్లు అని తెలిపారు. సున్నాను ఆవిష్కరించిన ఆర్యభట్ట భారతీయుడేనని, నేడు సున్నా మీదే డిజిటల్‌ ప్రపంచం నడుస్తున్నదన్నారు.

కౌటిల్యుడు అర్థశాస్ర్తానికి ఆద్యుడని గుర్తుచేశారు. 21 రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి పలు చట్టాలను భారత్‌ సవరించిందని చెప్పారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ వంటి భారత మహిళలు అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారని ప్రస్తుతించారు. రాణీ అహల్యాబాయి, హోల్కర్‌, రాణి లక్ష్మిభాయి వంటి మహిళలు అంద‌రికీ స్ఫూర్తినిస్తున్నారని తెలిపారు. .గుజరాత్‌లో లిజ్జత్‌ పాపడ్ వంటి సంస్థలను మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్‌ రేటింగ్‌ల్లో 180 నుంచి 100వ స్ధానానికి వచ్చామన్నారు. దేశంలో 8 కోట్ల మంది చిన్నా, పెద్ద పారిశ్రామికవేత్తలున్నారని చెప్పారు. ముద్ర పథకం ద్వారా రూ 4.82 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని అన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామనన్నారు.

Next Story
Share it