Telugu Gateway
Telugu

యువ‌తే గొప్ప సంప‌ద‌

వారం రోజులుగా హైద‌రాబాద్ ఒక‌టే జ‌పం చేసింది. ఇవాంకా..ఇవాంకా అని. అన్న‌ట్లే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ వ‌చ్చేశారు...హైద‌రాబాద్ లో ని హెచ్ ఐసిసిలో ప్రారంభం అయిన ప్ర‌తిష్టాత్మ‌క గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్ స‌మ్మిట్ (జీఈఎస్)లో పాల్గొని ప్ర‌సంగించారు. అంద‌రూ ఇవాంకా ప్ర‌సంగాన్ని ఎంతో ఆస‌క్తిగా ఆల‌కించారు. ఆమె కూడా స్పూర్తిదాయ‌క ప్ర‌సంగం చేశారు. ముఖ్యంగా ఆమె యువ‌త‌ను టార్గెట్ గా చేసుకుని త‌న ప్ర‌సంగం చేశారు. యువ‌తే గొప్ప సంప‌ద అని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ఇన్నోవేష‌న్ హ‌బ్ గా ఎదుగుతున్న హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న ఈ స‌ద‌స్సులో పాల్గొన‌టంత త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని ఇవాంకా వ్యాఖ్యానించారు. అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశమని,భారత్‌కు ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు. మీరంతా రాత్రింబవళ్లు కష్టపడి రోబోలు, యాప్‌లు రూపొందిస్తున్నారని ప్రశంసించారు.

భారతీయ నిపుణులు తమకు స్ఫూర్తిదాయకమని, టీ అమ్మే స్ధాయి నుంచి ప్రధాని కాగలడం మీ ప్రధాని గొప్పతనమని ప్రస్తుతించారు. ఆసియాలేనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్‌ రూపొందింది. ఈ సదస్సులో 52 దేశాలకు పైగా మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉంది..పురుషాదిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయమన్నారు. ‘ఓ పారిశ్రామికవేత్తగా మహిళ ఎదగడం ఎంత కష్టమో నాకు తెలుసు..మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నా’అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పది శాతం పెరిగిందని చెప్పారు. టెక్నాలజీతో పాటు రుచికరమైన బిర్యానీకి భారత్‌ అడ్డా అన్నారు.మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని..గత దశాబ్ధకాలంగా మహిళలు ఎంతో ఎత్తుకు ఎదిగారని చెప్పారు. కష్టపడితే మహిళలు వారి భవిష్యత్‌ను వారే తీర్చిదిద్దుకోగలరన్నారు. ఇవాంకా స్పీచ్ కు స‌భికుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది.

Next Story
Share it