చేరిన వెంటనే టీడీపీకి గిడ్డి ఈశ్వరి ఝలక్
ఆమె అప్పుడే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. చేరిన కొద్దిసేపటికే అధికార తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇచ్చారు. పొరపాటుగా అలా మాట్లాడారో ..లేక వాస్తవం అదే అని అనుకున్నారో కానీ...గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యలు మాత్రం టీడీపీ శ్రేణులను ఒకింత షాక్ కు గురిచేశాయనే చెప్పొచ్చు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం టీడీపీలో చేరిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ డ్యామ్షూర్ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది. ఈ వ్యాఖ్యలు విన్న టిడిపి నేతలు అవాక్కు అయ్యారు. అదే సమయంలో జగన్ అంటే తనకు ప్రాణమని, తనకు రాజకీయ భిక్ష పెట్టింది జగనే అని చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే గెలుస్తుందని ఆమె చెప్పారు.
గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో విశాఖ జిల్లా రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాక్సైట్ తవ్వకాలు చేస్తే సీఎం తలనరుకుతా అన్న వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించగా..తాను అప్పట్లో సీఎంను అనలేదని..ఇప్పటికీ ఎవరైనా బాక్సైట్ జోలికొస్తే అదే మాటకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఆమె సీఎంపైనే విమర్శలు చేశారని అప్పట్లో టీడీపీ నేతలు గిడ్డి ఈశ్వరి పై కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆమె టీడీపీలో చేరిపోయారు.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT