Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కొత్త నినాదం..నా పార్టీ..నా రాష్ట్రం

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం తెల్లవారుజామున మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ‘నా పార్టీ..నా రాష్ట్రం’ అన్న భావన ఉండాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం ఒక్కటే అన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశానికి దక్కిందని తెలిపారు. తెలుగువాళ్ళు ఎక్కడున్నా ..వారి సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తుందని..సొంత ఇంటికి వస్తే ఎంత గౌరవం ఉంటుందో ..పార్టీ కార్యాలయంలో అంతే గౌరవం ఇవ్వాలన్నారు.స్వచ్ఛంద కార్యక్రమాలు..సేవా కార్యక్రమాలు నిర్వహించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనే అని పేర్కొన్నారు.

టీడీపీ ఆఫీసులో నిత్య భోజన వసతి కల్పించటం ఆనవాయితీ అని..దీని కోసం ఫిక్స్ డ్ ఫండ్ ను ఏర్పాటు చేశామన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలన్నారు. పాత రోజుల్లోలాగా రాజకీయాలు చేయాలంటే కష్టమని..కొత్త విధానాలను అందిపుచ్చుకుంటూ వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యాలయాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే అవకాశం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పడుతుందన్నారు.

Next Story
Share it