Telugu Gateway
Telangana

మేడిగడ్డను క్యాచ్ చేయటంలో కాంగ్రెస్ ఫెయిల్!

మేడిగడ్డను క్యాచ్ చేయటంలో కాంగ్రెస్ ఫెయిల్!
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గర నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ చెప్పేమాట ఇది. సహజంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి దూకుడు ఎక్కువ. కానీ ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయి ఇందులోని డొల్లతనం బయటపడింది. ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు మునిగి కోట్ల రూపాయల మేర నష్టం తెచ్చిపెట్టాయి. అప్పుడు సీఎం కెసిఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్ర పేరు చెప్పి దాన్ని తప్పించారు. కానీ ఇప్పుడు సీఎం కెసిఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ మేడిగడ్డ విషయంపై అసలు నోరు తెరవటం లేదు. కాంగ్రెస్ నేతలు లక్ష కోట్ల రూపాయల అవినీతి అంటే...ప్రాజెక్ట్ పై ఖర్చు పెట్టింది ఎనభై వేల కోట్ల రూపాయలు అయితే లక్ష కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు అని కౌంటర్లు అయితే ఇచ్చారు కానీ..ఎనభై వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో కట్టిన...నిండా ఐదేళ్లు కూడా పూర్తి చేసుకోని ఈ ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున లోపాలు బయటపడుతూనే ఉన్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం నోరు తెరవటం లేదు. సహజంగా ఎన్నికల ముందు తమకు నష్టం చేసే అంశాన్ని ఎవరూ మాట్లాడకుండా తప్పించుకునే ప్రయత్నమే చేస్తారు.

కానీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తహ తహ లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన మేడిగడ్డ ఫెయిల్యూర్ ఇష్యూ ను రాజకీయంగా సరిగా డీల్ చేయటం లేదు అని...ఈ విషయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ ఫెయిల్ అయ్యారు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కీలక నేతలు అందరూ బస్సు లో మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్లి ఉంటే పరిస్థితి ఒక రేంజ్ లో ఉండేది అని..కానీ తాము ఆరోపణలు చేసిన ప్రాజెక్టులో డొల్లతనం బయటపడినా దాన్ని వాడుకోవాల్సిన రీతిలో వాడుకోవటంలో విఫలం అయింది అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచ రికార్డులు నమోదు చేసింది అని ప్రభుత్వం చెప్పుకుంటుంటే...ఎన్నికల ముందు మేడిగడ్డలో బయటపడ్డ లోపాలను కాంగ్రెస్ పార్టీ ఇంత తేలిగ్గా తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ దీనిపై ఫోకస్ పెట్టి ఉంటే రాజకీయంగా బిఆర్ఎస్ ఇరకాటంలో పడేది అని..కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేదు అనే చర్చ సాగుతోంది. టికెట్స్ ఖరారు హడావుడి లో ఉండి..ఈ విషయాన్ని వదిలేశారా లేక దీని వెనక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ కూడా సాగుతోంది.

ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తోంది వాళ్ళ మాటల్లో

Next Story
Share it