Telugu Gateway
Telangana

ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ ఘాట్ లో  జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
X

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ల‌తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు నివాళులు అర్పించారు. నంద‌మూరి బాల‌క్రిష్ణ నిమ్మ‌కూరులో జ‌రిగిన కార్య‌క్ర‌మంతోపాటు..తెనాలిలో ఎన్టీఆర్ శత జ‌యంతి ఉత్స‌వాల‌ను ప్రారంభించారు. మ‌హానాడులో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడుతోపాటు పార్టీ నేత‌లు అంద‌రూ దివంగ‌త నేత‌ను స్మ‌రించుకున్నారు.

హైద‌రాబాద్ లో ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు.ఎన్టీఆర్‌ జయంతి వేళ ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని దివంగ‌త నేత‌ల‌కు నివాళులు అర్పించారు. తొలిసారి టీఆర్ఎస్ నేతలు కూడా ఎన్టీఆర్ ఘాట్ ను సంద‌ర్శించ‌టం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

Next Story
Share it