ఆదిలాబాద్ లో కాల్పుల కలకలం
BY Admin18 Dec 2020 2:16 PM GMT
X
Admin18 Dec 2020 2:16 PM GMT
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ జరిపిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర గాయాల పాలు అయ్యారు. కాల్పులు జరపటంతో పాటు తల్వార్ తో కూడా దాడికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ఫరూక్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో జమీర్, మోతేషాన్ అనే ఇద్దరు గాయాల పాలయ్యారు.
వారిని ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరిపిన అనంతరం ఫరూక్ అక్కడ నుంచి పరార్ అయ్యాడు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఫారుఖ్ అహ్మద్ లైసెన్స్ ఉన్న గన్ తో కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.
Next Story