Telugu Gateway
Telangana

పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాలతో సత్వరమే చర్చలు

పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాలతో సత్వరమే చర్చలు
X

తెలంగాణ లో ఉద్యోగులు పీఆర్ సీ అమలు విషయంలో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.క ప్రభుత్వం చేతికి పీఆర్ సీ నివేదిక అందినా ..అందులోని అంశాలు మాత్రం బహిర్గతం కాలేదు. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సత్వరమే పీఆర్ సీపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం కెసీఆర్ ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల పీ ఆర్ సి , ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ , ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు , రజత్ కుమార్ ల ఆద్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు . వారం , పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీ ఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు .

Next Story
Share it