దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం
BY Admin14 Dec 2020 7:57 AM GMT
X
Admin14 Dec 2020 7:57 AM GMT
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ రన్నింగ్ లోనే లాక్ కావటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలం నుంచి గవర్నర్ దత్తాత్రేయ మరో వాహనంలో సూర్యాపేట బయల్దేరి వెళ్లారు.
Next Story