Telugu Gateway
Telangana

కృష్ణా జ‌లాల‌పై ఏపీ దాదాగిరి

కృష్ణా జ‌లాల‌పై ఏపీ దాదాగిరి
X

ద‌ళిత బంధుతో విప‌క్ష పార్టీల‌కు బీపీ పెరుగుతోంది

ముఖ్య‌మంత్రి కెసీఆర్ కృష్ణా జ‌లాల అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ అంశంలో ఏపీ స‌ర్కారు దాదాగిరి చేస్తోంద‌ని విమ‌ర్శించారు. రాబోయే రోజుల్లో కృష్ణా జ‌లాల‌కు సంబంధించి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కేంద్రం కూడా తెలంగాణ‌కు అన్యాయం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌కు క‌రోనా రావ‌టం వ‌ల్లే ఇక్క‌డ‌కు రావ‌టం ఆల‌శ్యం అయింద‌ని తెలిపారు. సీఎం కెసీఆర్ సోమ‌వారం నాడు నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని హాలియాలో ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంపై వ‌రాల వ‌ర్షం కురిపించారు. నాగార్జున సాగ‌ర్ అభివృద్ధికి 150 కోట్ల రూపాయ‌లు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, హాలియాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్య కేంద్రాలను, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నందికొండ మున్సిపాలిటీలో ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ''నాగార్జునసాగర్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపిస్తాం. దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్ ఇచ్చాం. జానారెడ్డి మాట తప్పి సాగర్‌లో పోటీ చేశారు. దళితబంధు పథకంపై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. 12లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం తప్పకుండా చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళితబంధు అమలు చేస్తాం. దళితబంధు పథకంతో విపక్షాలకు బీపీ మొదలైందని'' సీఎం కేసీఆర్‌ అన్నారు.

Next Story
Share it