Telugu Gateway
Politics

దేశాన్ని న‌డిపే డ‌బుల్ ఇంజిన్ మోడీ..ఈడీ

దేశాన్ని న‌డిపే డ‌బుల్ ఇంజిన్ మోడీ..ఈడీ
X

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ కూడా త్వ‌ర‌లోనే ఈడీ, సీబీఐ విచార‌ణ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ గురువారం నాడు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. వీటిపై మంత్రి కెటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. తమకు ఇప్పుడు అర్ధం అయింద‌ని..దేశాన్ని న‌డిపే డ‌బుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ ను ఈడీ చీఫ్ గా కూడా నియ‌మించినందుకు ధ‌న్య‌వాదాలు అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీలో స‌మావేశం పెట్టుకున్నార‌ని బండి సంజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Next Story
Share it