Telugu Gateway
Politics

మున్సిపోల్స్ లోనూ టీఆర్ఎస్ దే హవా

మున్సిపోల్స్ లోనూ  టీఆర్ఎస్ దే హవా
X

వరస ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతోంది. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ..ఇప్పుడు మున్సిపోల్స్ లోనూ హవా చూపెట్టింది. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని గులాబీ పార్టీ సత్తా చాటింది. వరంగల్‌, ఖమ్మం కార్పొఒరేషన్‌లను కూడా టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణులు ఫుల్ కుషీకుషీగా ఉన్నాయి. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లను కూడా టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. టీఆర్‌ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. ఈ గెలుపుపై ముఖ్యమంత్రి కెసీఆర్ స్పందించారు.

రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను టీఆర్ఎస్ కు, 3 స్థానాలను మిత్రపక్షం సీపీఐకి కలిపి 184 స్థానాల్లో గెలిపించి టీఆర్ఎస్ కు తిరుగులేదని మరోమారు నిరూపించారని సీఎం అన్నారు. టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ఏడు మున్సిపాలిటీల ప్రజలందరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story
Share it