Telugu Gateway
Politics

రేవంత్..రామోజీ రాజకీయ చర్చలు

రేవంత్..రామోజీ రాజకీయ చర్చలు
X

లోక్ సభ ఎన్నికల వేళ కీలక పరిణామం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు తో భేటీ అయ్యారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు ప్రధాన మీడియా సంస్థలు అధికార పార్టీ కి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఈ తరుణంలో రామోజీ రావు తో రేవంత్ రెడ్డి భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆదిలాబాదు పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలపై చర్చించారు. దేశం తో పాటు రాష్ట్రం లోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయని పార్టీ నేతలు వెల్లడించారు. ఈ భేటీలో సీఎం వెంట ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ ఉన్నారు.

Next Story
Share it