Telugu Gateway
Politics

కెసీఆర్ ను గ్యారంటీగా ట‌చ్ చేస్తాం

కెసీఆర్ ను గ్యారంటీగా ట‌చ్ చేస్తాం
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కెసీఆర్ మాట‌లు చూస్తుంటే ఆయ‌న ఎంత ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్నారో అర్ధం అవుతుంద‌ని అన్నారు. నా త‌ల ఆరు ముక్క‌లు కాదు..అర‌వై ముక్క‌లు అయినా స‌రే ఆయ‌న్ను ఎప్పుడు ట‌చ్ చేయాలో అప్పుడు ఖ‌చ్చితంగా ట‌చ్ చేస్తామ‌న్నారు. ఈ న‌యా నిజాంను గద్దె దింపేవ‌ర‌కూ బిజెపి విశ్ర‌మించ‌ద‌న్నారు. త‌మ దెబ్బ‌కే ఫాంహౌస్ వీడి బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. దళితులకు రూ. 10 లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదని సంజయ్ హెచ్చరించారు. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా? అని ఆయన ప్రశ్నించారు.

దళితబంధు కావాలో.. వద్దో ఎస్సీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని సంజయ్ సూచించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టిన రోజు కేసీఆర్ ఎందుకు సభలో లేడు? అని ఆయన ప్రశ్నించారు. వర్షకాలంలో పండిన వరి ధాన్యాన్ని కొంటాడో లేదో కేసీఆర్ చెప్పాలని, కేసీఆర్ బూతు మాటలు విని తెలంగాణ సమాజం తల దించుకుంటోందని సంజయ్ అన్నారు. పేదల కోసం కేసీఆర్‌తో తల‌ నరుక్కోవటానికి తాను సిద్ధమని, కేసీఆర్ సిద్ధమా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నానని, అంబేద్క‌ర్‌ విగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Next Story
Share it