Telugu Gateway
Andhra Pradesh

తెలుగుదేశానికి ఎస్ఈసీ నోటీసులు

తెలుగుదేశానికి ఎస్ఈసీ నోటీసులు
X

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టో విడుదల చేసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఎస్ఈసీ నోటీసులు జారీ చేసింది. అధికార వైసీపీ ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 2లోగా సమాధానం ఇవ్వాలని..లేదంటే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పార్టీరహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయటం నిబంధనలకు విరుద్ధం అని..టీడీపీపై చర్యలు తీసుకోవాలని వైసీపీ పలుమార్లు డిమాండ్ చేసింది.

పార్టీ రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టంచేస్తోందని కమిషన్‌ దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ అంశంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కూడా తీవ్ర విమర్శలు చేసింది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ అభ్యర్ధులను గెలిపిస్తే ఇళ్ళ నిర్మాణంతోపాటు పలు హామీలు ఇచ్చారు.

Next Story
Share it