Telugu Gateway
Andhra Pradesh

కెసీఆర్..చంద్ర‌బాబు మ‌ధ్య ఏమి అవ‌గాహ‌న ఉందో?

కెసీఆర్..చంద్ర‌బాబు మ‌ధ్య ఏమి అవ‌గాహ‌న ఉందో?
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కెసీఆర్ మాట్లాడ‌టం..దానిపై చంద్ర‌బాబు స్పందించటం చూస్తుంటే వారిద్ద‌రి మ‌ధ్య ఏమి అవగాహ‌న ఉందో అనే అనుమానం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై స‌జ్జ‌ల మండిప‌డ్డారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన దృష్టి మరల్చేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. అబద్ధాలు, వంచన, డ్రామా బాబుకు తెలిసిన ఏకైక విద్య అని సజ్జల మండిపడ్డారు. బాబు, ఢిల్లీకి వెళ్లటం పచ్చమీడియా పెద్ద వార్తగా ప్రచారం చేస్తోంది. బాబు బూతు పంచాంగం డ్రామా ఫెయిల్‌ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ టూర్‌ పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపారని అన్నారు.

డ్రగ్స్‌పేరుతో రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చం‍ద్రబాబు, చర్యలు ఏపీకి తీవ్ర నష్టం కలిగే విధంగా ఉన్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. తనకు ఓటు వేయని ప్రజలపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ స్థాయిలో ఏపీ పరువు తీసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని అన్నారు. అబద్ధాలు ప్రొజెక్ట్‌ చేయడంలో చం‍ద్రబాబుకు మించినవాళ్లులేరని అన్నారు. అమిత్‌ షా ఫోన్‌ చేసినట్లు కలరింగ్‌ ఇచ్చారు. ఎయిడెడ్‌ స్కూళ్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీలో జరిగిన ఆందోళనల్లో టీడీపీ పార్టీ ప్రమేయం ఉందని సజ్జల మండిపడ్డారు.

Next Story
Share it