Telugu Gateway
Andhra Pradesh

రేవంత్ రెడ్డి టీడీపీ కోవ‌ర్టు

రేవంత్ రెడ్డి టీడీపీ కోవ‌ర్టు
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇటీవ‌ల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజా ఇంట్లో కెసీఆర్ విందు ఆర‌గించి..బేసిన్లు లేవు..బేష‌జాలు లేవ‌ని ప్ర‌క‌టించారా లేదా అని ప్ర‌శ్నించారు. అప్పుడు పోరాడి సాధించుకున్న తెలంగాణ నీళ్ళ అంశం గుర్తులేదా అంటూ మండిప‌డిన విష‌యం తెలిసిందే. దీనికి రోజా కౌంట‌ర్ ఇస్తూ కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసింది రేవంత్‌కి గుర్తు లేదా? అని ప్రశ్నించారు. తమ ఇంటికి జగన్ ఏప్పుడూ రాలేదని, ఇక కేసీఆర్‌తో మంతనాలు ఎలా జరుపుతారని అడిగారు.

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కారించవలసిన బాధ్యత కేంద్రానిదే అని రోజా వ్యాఖ్యానించారు. రైతులను దగా చేసిన ప్రభుత్వం చంద్రబాబుది అని రోజా విమ‌ర్శించారు. రోజా శుక్రవారం తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. రైతుల కోసం జగన్ నాలుగు అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. వివిధ పథకాల ద్వారా 83 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేసిన ప్రభుత్వం జగన్‌ది అన్నారు. చంద్రబాబు, లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it