Telugu Gateway
Andhra Pradesh

జగన్ కీలక నిర్ణయం..తిరుపతి ప్రచారానికి దూరం

జగన్ కీలక నిర్ణయం..తిరుపతి ప్రచారానికి దూరం
X

తిరుపతి వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కోసం మంత్రులే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ఒక రోజు సీఎం జగన్ కూడా తిరుపతి ప్రచారంలో పాల్గొంటారని వార్త వచ్చింది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా జగన్ ప్రచారం చేయటం తప్పేమీ కాకపోయినా అత్యంత కీలకమైన మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడ జగన్ బయటకు రాలేదు. అంతే కాదు..తిరుపతి ప్రచార బాధ్యత అంతా మంత్రులకే అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. సడన్ గా జగన్ ప్రచారానికి వస్తున్నారరటంతో సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగ్ లు వచ్చాయి. కొంత మంది వైసీపీ అభిమానులు కూడా జగన్ నిర్ణయంపై రకరకాల వ్యాఖ్యలతో పోస్టింగ్ లు పెట్టారు. అయితే ఇఫ్పుడు సీఎం జగన్ తిరుపతి ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ''నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి.

చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. తిరుపతి సభకు నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాలేకపోయినా.. 22 నెలల్లో మీకు చేసిన మంచి మీ అందరికి చేరిందన్న నమ్మకం నాకుంది.. గతంలో వచ్చిన 2.28 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలి. డా.గురుమూర్తికి ఓటు వేయాలని రాసిన ఉత్తరం మీకు చేరిందని భావిస్తున్నా. డా.గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నానని'' లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Next Story
Share it