Telugu Gateway
Andhra Pradesh

దాడి చేసి త‌ప్పుడు కేసులు పెడ‌తారా?

దాడి చేసి త‌ప్పుడు కేసులు పెడ‌తారా?
X

ఏపీ స‌ర్కారు తీరుపై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడి చేసి రివ‌ర్స్ కేసులు పెట్ట‌డం ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ తీరుపై కూడా చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పోలీసులు త‌మ ప‌ద్ద‌తి మార్చుకోవాల‌న్నారు. ఆయ‌న శ‌నివారం నాడు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలే దాడులు చేసి రివర్స్ కేసులు పెట్టారని మండిపడ్డారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చోట చెట్లను నరికేస్తున్నారన్నార‌ని విమ‌ర్శించారు. ఉమాపైన హత్యాయత్నం కేసు పెట్టడానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్ర‌శ్నించారు. ఎంతోమంది డీజీపీలు తన దగ్గర పనిచేశారని, ఎప్పుడు ఈ డీజీపీలా ఎవరూ ఇలా చేయలేదన్నారు. అవినీతి జరుగుతుందని టీడీపీ నేతలు అక్కడికి వెళ్తే ఇంత నీచంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. నిజ నిర్ధారణ కమిటీ వేస్తే అక్కడ కరోనా ఉందని సాకుతో పంపరా అని నిలదీశారు. దేవినేని ఉమా ఏం తప్పు చేశారన్నారు. ఎనిమిది గంటలు కారులోనే ఉన్నారన్నారు. దేవినేని ఉమా ప్రాణాలు కాపాడాలని డీజీపీకి లేఖ రాశానని చంద్రబాబు చెప్పారు.

దేవినేని ఉమాను రూటు మార్చింది పోలీసులు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గూండాలు, రౌడీల రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని చెప్పారు. వైసీపీ నేతలు రాళ్లేస్తే పారిపోతామా అని ప్ర‌శ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. సంక్షేమం.. హక్కులు లేవని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీని వాడుకుంటున్నారని వాళ్లకు ఏ విధంగానూ వైసీపీ సర్కారు ఉపయోగపడడం లేదన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని దుయ్యబట్టారు. జగన్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడే రాష్ట్రమంతా నాశనమైందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఊరికొక రౌడీ వస్తాడని చంద్రబాబు అన్నారు.

Next Story
Share it