Telugu Gateway
Andhra Pradesh

టోల్ అడిగారని దాడి చేసిన ఏపీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్

టోల్ అడిగారని దాడి చేసిన ఏపీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్
X

ఆమె ఏపీ సర్కారు కొత్తగా నియమించిన ఓ కార్పొరేషన్ ఛైర్మన్. టోల్ ఫీజు అడిగారని కారు దిగి వీరంగం వేశారు. అడ్డంగా ఉన్న బారికేడ్లను తోసిపడేసి...అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ సిబ్బంది చెంపపై చెళ్ళు మన్పించారు. ఈ ఇది చూసిన వారంతా అవాక్కు అయ్యారు. ఆమెకు సిబ్బంది సర్దిచెబుతున్నా సరే ఆమె అదే తరహాలో దూకుడు చూపించారు.

సిబ్బందిపై దాడి చేసిన తర్వాత మరోసారి బారికేడ్ ను పక్కకు తోసేసి కారెక్కి వెళ్ళిపోయారు. గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద ఈ హంగామా చేసింది ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ళ రేవతి. టోల్ ప్లాజా వద్ద వావానాన్ని ఆపటంతో 'నన్నే టోల్ అడుగుతావా అంటూ ఊగిపోయి'నానా హంగామా చేశారు. ఈ వీడియో ఇఫ్పుడు వైరల్ గా మారింది.

Next Story
Share it