Telugu Gateway
Politics

బిజెపిలోకి కుష్పూ సుందర్!

బిజెపిలోకి కుష్పూ సుందర్!
X

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకె అంతర్గత వివాదాలను సర్దుబాటు చేసుకుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సోమవారం నాడు షాక్ తగలనుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న కుష్పూ సుందర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం కన్పిస్తోంది. ఆమె ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

కుష్పూ ఢిల్లీలో సోమవారం నాడే బిజెపిలో చేరనున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా పాలసీని సమర్థిస్తూ కుష్బూ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. అంతే కాదు..చెన్నయ్ లోని రాష్ట్ర నేతలతోనూ ఆమెకు విభేదాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Next Story
Share it