Telugu Gateway
Politics

కెసీఆర్ పై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు

కెసీఆర్ పై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు
X

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శల జోరు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కెసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలు కేసీఆర్ జీతగాడిని కాకుండా.. తమ కోసం పనిచేసే వ్యక్తిని రాష్ట్ర శాసనసభకు పంపాలన్నారు. చేగుంటలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో భట్టి విక్రమార్క మల్లు భట్టివిక్రమార్క పాల్గొని ప్రసంగించారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ఎందుకు అవసరమో ఆయన వివరించారు. ఎల్.ఆర్.ఎస్ పేరుతో కేసీఆర్ పేద, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని తాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిడ్డ పెళ్లి కోసమో, కొడుకుల చదువుల కోసమే.. భవిష్యత్ కోసమే కష్టపడి రూపాయి రూపాయి దాచుకుని కొనుక్కున్న ఇంటి స్థలంకు పన్ను అడగడం ఏమిటని ప్రశ్నించారు. ఎల్.ఆర్.ఎస్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం ఆదాయం రూ.11వేల కోట్ల రూపాయలు ఉంటే. ఇప్పుడు ఒక్క తెలంగాణలో రూ.26 వెల కోట్లుగా ఉందని భట్టి చెప్పారు. ఇస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు.. ఉద్యొగలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. అని భట్టి చెప్పారు.

Next Story
Share it