Telugu Gateway
Cinema

డ్రగ్స్ కేసు..రియా చక్రవర్తికి బెయిల్

డ్రగ్స్ కేసు..రియా చక్రవర్తికి బెయిల్
X

కీలక పరిణామం. దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తికి ముంబయ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ముంబయ్ వదిలి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ తిరస్కరించారు. గత కొంత కాలంగా ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణలో వ్యవహారం అంతా డ్రగ్స్ చుట్టూ తిరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ ను గట్టిగా వ్యతిరేకించింది.

రియా కు డ్రగ్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నాయని..డ్రగ్స్ కొనుగోలు చేసి తన నివాసంలో పెట్టుకోవటంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ అందజేసిందని ఆమెపై ఎన్ సీబీ అభియోగాలు మోపింది. అంతే కాకుండా చెల్లింపులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని ఎన్ సీబీ తెలిపింది. ఈ కేసు విచారణ పూర్తి అయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన ముంబయ్ హైకోర్టు బుధవారం నాడు తీర్పు వెలువరించింది. ఎన్ సీబీ ఈ కేసులో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లకు సమన్లు జారీ చేసి విచారించిన విషయం తెలిసిందే.

Next Story
Share it