Telugu Gateway
Politics

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. వాస్తవానికి ఈ సమావేశాలు సెప్టెంబర్ 28 వరకూ జరగాల్సి ఉంది. కానీ అసెంబ్లీ సిబ్బందితోపాటు పలువురికి కరోనా వైరస్ సోకటంతో అర్ధాంతరంగా సమావేశాలను ముగించారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకోవటంతో బుధవారం నాడు శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటన చేశారు. సభ్యులతోపాటు సిబ్బంది, పోలీసులు అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సమావేశాల్లో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రెవెన్యూ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లుతో సర్కారు పలు బిల్లులను ఆమోదింపచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే సభ్యులతో పాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించి కరోనా లేని వారిని మాత్రమే సభలోకి అనుమతించారు. అయినా కూడా మధ్యలో కొంత మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో సమావేశాలను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it