Telugu Gateway
Andhra Pradesh

జగన్ గట్స్ ఉన్న నాయకుడు

జగన్ గట్స్ ఉన్న నాయకుడు
X

తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన కుమారులతో కలసి శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ ఇద్దరు కుమారులు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేశ్‌ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘నా కుమారులు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు. ఆయన ధైర్యమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయి.

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. ’అని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుటుంబం విశాఖ ప్రజల కోసం చేస్తున్న సేవలు ఎంతో కీలకం అని వ్యాఖ్యానించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం చాలా మంచిదని పేర్కొన్నారు. వాసుపల్లి గణేష్ కుమారులు పార్టీలోకి రావడం బలాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో విద్యావంతులు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీలోకి చాలా మంది వస్తారని జోస్యం చెప్పారు. విశాఖలో టీడీపీ తుడిచిపెట్టుకు పోతుందనడంలో సందేహం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటే కదా ప్రతిపక్ష నాయకుడు ఉండేదని ఎద్దేవా చేశారు.

Next Story
Share it