మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్
BY Telugu Gateway3 Sep 2020 4:10 AM GMT
X
Telugu Gateway3 Sep 2020 4:10 AM GMT
హ్యాకర్లు గత కొంత కాలంగా ట్విట్టర్ కు సవాళ్లు విసురుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో కీలక వ్యక్తుల చెందిన ఖాతాలు హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఖాతాలో మోడీకి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఖాతాను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. జాన్ విక్ ఈ ఖాతాను హ్యాక్ చేసినట్లు ప్రకటించుకున్నాడు. భారత్ క్రిప్టో కరెన్సీని ప్రారంభిస్తుందని ప్రకటించాడు.
Next Story