Telugu Gateway
Andhra Pradesh

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్
X

శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్ నాయుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నూతన్‌ భార్య ప్రియమాధురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉడిపిలో శుక్రవారం మధ్యాహ్నం నూతన్‌ను అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు. ప్రియమాధురి సహ ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్స్‌ సీజ్ చేశామని.. నూతన్ భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిందని సీపీ వెల్లడించారు. సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించారు.

శిరోముండనం ఘటనలో నూతన్‌నాయుడు ప్రమేయం ఉందని మరోసారి సీపీ స్పష్టం చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్‌ విధించింది తన మధుప్రియను భార్యను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్‌చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు.

Next Story
Share it