Telugu Gateway
Cinema

కంగనాపై మరో విచారణ

కంగనాపై మరో విచారణ
X

కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్ర సర్కారు ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ఆమె ఆఫీసును కూల్చిన బీఎంసీ అధికారుల వ్యవహారం మరవక ముందే పాత డ్రగ్స్ కేసును తవ్వటానికి సర్కారు రెడీ అయిపోయింది. దీనిపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. కంగనాపై వచ్చిన డ్రగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ముంబయ్ పోలీసులను మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. నిషేధించిన పదార్థాలు, నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ను ఆమె వాడతారనే ఆరోపణల నిగ్గు తేల్చాలని ముంబై పోలీసులను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. కంగనా కొకైన్‌ వాడతారని తెలిపారు.

అంతే కాకుండా తనను కూడా డ్రగ్‌ను తీసుకోమని ఆమె కోరారని 2016లో రికార్డైన నటుడు అధ్యయన్‌ సుమన్‌ ఇంటర్వ్యూ నేపథ్యంలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని ప్రభుత్వం కోరడంతో ముంబయ్ పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ చేపట్టాలా, యాంటో నార్కోటిక్స్‌ విభాగానికి దర్యాప్తు బాధ్యత అప్పగించాలా అనేది ముంబై పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ అంశంపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే అథ్యాయన్‌ సుమన్‌తో పాటు కంగనా రనౌత్‌లకూ సమన్లు జారీ చేస్తారు.

Next Story
Share it