మళ్ళీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా
BY Telugu Gateway13 Sep 2020 4:07 AM GMT
X
Telugu Gateway13 Sep 2020 4:07 AM GMT
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ నుంచి రికవరి అయిన తర్వాత కూడా పలు సమస్యలు వేధిస్తున్నట్లు కన్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎయిమ్స్ లో పోస్టు కోవిడ్ చికిత్స పొంది ఆగస్టు 31న డిశ్చార్జి అయిన అమిత్ షా..శనివారం రాత్రి తిరిగి మళ్ళీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచే అమిత్ షా విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఆగస్టు 31నే ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన అమిత్ షా తిరిగి ఎయిమ్స్ చేరటంతో అమిత్ షాను పలు సమస్యలు వేధిస్తున్నట్లు చెబుతున్నారు.
Next Story