చంద్రబాబు కాన్వాయ్ లో ప్రమాదం
BY Telugu Gateway5 Sep 2020 3:07 PM GMT
X
Telugu Gateway5 Sep 2020 3:07 PM GMT
అమరావతి నుంచి హైదరాబాద్ వస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. సడన్ బ్రేక్ కారణంగా ఒక్కసారిగా కాన్వాయ్లోని ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని చంద్రబాబు వాహనం బలంగా ఢీ కొట్టింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో మరో వాహనంలో వారిని తరలించారు.
Next Story