Telugu Gateway
Politics

కెసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం

కెసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం
X

తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిలబడితే, నిజాం, రజాకార్ల పక్కన ముఖ్యమంత్రి కెసీఆర్ నిలబడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కెసీఆర్ ను త్వరలోనే ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ బిజెపి శుక్రవారం నాడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. నగరంలోని బిజెపి నేతలను పోలీసులు ముందు జాగ్రత్తగానే హౌస్ అరెస్ట్ చేశారు. నేతలు, కార్యకర్తలను ఎక్కడికి అక్కడ కట్టడి చేశారు. అయినా సరే పలువురు బిజెపి కార్యకర్తలు, మహిళా మోర్చా నేతలు అసెంబ్లీ వద్దకు వివిధ మార్గాల్లో చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరంతా ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. అయితే ఆయన్ను తీసుకెళుతున్న వాహనానికి కార్యకర్తలు అడ్డం పడటంతో వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తమ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతం అయిందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it